“సంస్కృత సాగరం నుండి చీలి పడిన పిల్ల కాలువ అమ్మ(సంస్కృతి) కమ్మదనం పుణికి పుచ్చుకున్న అక్షర ధార వేలాది పండిత వీరులు కలిసి విస్తరించిన జాడ ఇంకినది తెలుగు భాషా వైభవం పరాయి పాలనలో మురికి పట్టినది మిడిమిడి జ్ఞానపు రాతలతో. బాషాభివృద్ధికి మంచి కొట్లాటలు లేవు పదునైన మాటల పోట్లాటలు లేవు భాషతో ఆటపాటలడాలని లేని మనిషికి తెలుగు మిగులున్నది సంభాషణకు మాత్రమే.”